ముంబై, జూన్ 12: దేశీ శ్రీమంతుల్లో ద్వితీయస్థానంలో వున్న గౌతమ్ అదాని తాజాగా సిమెంటు వ్యాపారంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే విద్యుత్, ఇన్ఫ్రా, రేవులు, విమానయాన రంగాల్లో గణనీయమైన మార్కెట్ వాటా సాధించిన అదాని గ్రూప్&అదాని సిమెంట్ ఎంటర్ప్రైజెస్’ పేరుతో గుజరాత్ కేంద్రంగా స్వంత సబ్సిడరీని ఏర్పాటుచేసినట్లు శనివారం స్టాక్ ఎక్సేంజ్లకు తెలిపింది. ఈ కొత్త సబ్సిడరీ రూ. 10 లక్షల అధీకృత మూలధనాన్ని, రూ. 5 లక్షల చెల్లింపు మూలధనాన్ని కలిగివుంటుంది.