ముంబై : తమ గ్రూపునకు చెందిన మూడు కంపెనీ అకౌంట్లు సీజ్ అయినట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూపు ఖండించింది. ఆ వార్తలు ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించినట్లు ఆ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొన్నది. అదానీకి చెందిన మూడు విదేశీ నిధులను నేషనల్ సెక్యూర్టీ డిపాజిటరీ లిమిటెడ్ ఫ్రీజ్ చేసినట్లు వార్తలు వ్యాపించాయి. దీంతో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అదానీ కంపెనీ ఇవాళ 25 శాతం వరకు షేర్లను కోల్పోయింది. దీనిపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూపు.. తమ కంపెనీల షేర్లు ఫ్రీజ్కాలేదన్నది.
దారుణ పతనం..
ఇవాళ ఉదయం అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు 43వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సీజ్ చేయడంతో ఆ కంపెనీ షేర్లు డౌనయ్యాయి. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీల నిధులను ఎన్ఎస్డీఎల్ నిలిపివేసింది. గత ఏడాది సుమారు 800 శాతం దూసుకువెళ్లిన అదానీ గ్రూపు ఇప్పుడు ఒకేసారి బోల్తాకొట్టింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఆ మూడు విదేశీ కంపెనీల వివరాలను ఆదానీ గ్రూపు వెల్లడించలేదు. దీంతో నేషనల్ సెక్యూరిటీస్ చర్యలు తీసుకున్నది.
గత దశాబ్ధ కాలంలో అదానీ షేర్లు పతనం కావడం ఇదే మొదటిసారి. అదానీ పోర్ట్స్ 19 శాతం పతనమైనట్లు నిఫ్టీ పేర్కొన్నది. ఇటీవల అదానీ షేర్లు దూసుకెళ్లడంతో.. దాని చైర్మెన్ గౌతమ్ అదానీ .. ఆసియాలో రెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు గత ఏడాది కాలంలో పది రేట్లు పెరిగాయి. అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు కూడా ఎనిమిది రేట్లు పెరిగాయి. అదానీ పోర్ట్స్ 148 శాతం, అదానీ గ్రీన్ 267 శాతం గత ఏడాది పెరిగాయి.