ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వ్యాక్సిన్ల కొరత ఆందోళన రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో నగరంలోని 52 వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వద్ద ఉన్న వ్యాక్సిన్ నిల్వలు శనివారం కొద్ది గంటలకే సరిపోతాయని నగర పాలక సంస్థ అధికారి పేర్కొన్నారు.
వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఎదురైందని కేవలం రెండో డోసు తీసుకునేందుకు వేచిచూస్తున్న వారికే వ్యాక్సిన్లు ఇవ్వలని సిబ్బందికి సూచించామని బీఎంసీ వర్గాలు వెల్లడించాయి. తమకు తక్కువ మోతాదులో వ్యాక్సిన్ డోసులు వస్తుండటంతో వాటిని ఆయా కేంద్రాలకు కేటాయించడం సంక్లిష్టంగా మారిందని తెలిపాయి. మరికొద్ది గంటల్లో వ్యాక్సిన్ సరఫరాలు అందుబాటులోకి రాగానే తిరిగి వ్యాక్సినేషన్ కేంద్రాలు తెరుచుకుంటాయని పేర్కొన్నాయి. వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడటంతో వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వ దవాఖానల వద్ద ప్రజలు బారులు తీరారు