దుబాయ్: దేశంలో కొవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో యుఏఈ ఫ్లాగ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రయాణీకుల విమానాల రద్దును జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కరోనా విజృంభన కారణంగా దుబాయ్కు చెందిన వైమానికి సంస్థ ఎమిరేట్స్ మొదటగా ఏప్రిల్ 24న ప్రయాణ సర్వీసుల రద్దును ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో రోజువారి కేసులు, మరణాలు అధికంగా నమోదు అవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా గత 14 రోజుల్లో భారత్ గుండా ప్రయాణించిన ప్రయాణికులు మరే ఇతర ప్రదేశం నుండి యూఏఈకి ప్రయాణించడానికి అనుమతి లేదంది. కాగా యూఏఈ పౌరులు, యూఏఈ గోల్డెన్ వీసాలు కలిగి ఉన్నవారు, కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించే దౌత్య కార్యకలాపాల సభ్యుల ప్రయాణానికి మినహాయింపు ఇచ్చింది.