శివసేనలో చేరిన సినీ నటి ఊర్మిళ..

హైదరాబాద్: బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్.. ఇవాళ శివసేన పార్టీలో చేరారు. ముంబైలో ఆ పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. శివసేనలో చేరనున్నట్లు గత కొన్ని రోజుల నుంచి ఊర్మిళపై ప్రచారం సాగుతున్నది. అయితే ఆ ఊహాగానాలకు ఆమె తెరదించారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఊర్మిళ పోటీ చేసి ఓడిపోయారు. ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి నుంచి పోటీ చేసిన ఆమె ఆ ఎన్నికల్లో ఓడారు. పార్టీలో ఉన్న అంతర్గత కలహాల వల్లే తాను ఓడినట్లు ఆమె ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ గత ఏడాదే ఆమె రాజీనామా చేశారు. బాంద్రాలోని సీఎం థాకరేకు చెందిన మాతోశ్రీ నివాసంలో ఇవాళ జరిగిన కార్యక్రమంలో ఊర్మిళ శివసేన పార్టీలో చేరారు. గవర్నర్ కోటాలో ఊర్మిళకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
जय महाराष्ट्र ???????????????????????????? pic.twitter.com/sUinOcagrP
— Urmila Matondkar (@UrmilaMatondkar) December 1, 2020
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు