ఎల్బీనగర్, జూలై 6 : అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి సూచించారు. మంగళవారం పౌర సరఫరాల శాఖ అధికారులతో ఎమ్మెల్యే తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తుందన్నారు. దరఖాస్తులు చేసుకున్న వారిని గుర్తించి వారిలో నిజమైన లబ్ధిదారులకు కార్డులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా సహా య పౌరసరఫరాల అధికారి సరస్వతి, రంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ సహాయ అధికారి బాల సరోజ తదితరులు పాల్గొన్నారు.
బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబూ జగ్జీవన్రాం అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వర్ధంతి సందర్భంగా తన కార్యాలయంలో చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పాటుపడిన బీజేఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాజీ కార్పొరేటర్ పద్మనాయక్, సాహెబ్నగర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, ఉమేశ్, మల్లేశ్ గౌడ్, రఘుమారెడ్డి, తులసీ కృష్ణ, శ్రీనాథ్ పాల్గొన్నారు.
బాబూ జగ్జీవన్రాం వర్ధంతిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రాం ఉత్సవాల ఎల్బీనగర్ కమిటీ కన్వీనర్ ఆడాల రమేశ్, కోకన్వీనర్ కొంగరి నర్సింహారావు ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ జోగు రాములు, ఉపాధ్యక్షుడు ఏర్పుల గాలయ్య, షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సెల్ ఎల్బీనగర్ అధ్యక్షుడు బాలాజీ గైక్వాడ్, శ్రీప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఫౌండర్, చైర్మన్ గుంటి లక్ష్మణ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్యగౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తూర్పాటి చిరంజీవి, దళిత సంఘాల జేఏసీ చైర్మన్ ఈదుల పరశురాం తదితరులు హాజరై జగ్జీవన్రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గట్టిగుండ్ల ప్రకాశ్, ఉమా మహేశ్వర్రావు, గుండె గిరిబాబు, గుండె కిరణ్, రమేశ్, గుంటి రాజు తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్ మండల కార్యాలయం వద్ద దళిత బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బాబూ జగ్జీవన్రాం వర్ధంతిని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, హయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి హాజరై జగ్జీవన్రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు బోడ భిక్షపతి, బండారి భాస్కర్, ఉగాది ఎల్లప్ప, సంఘి అశోక్, సుక్క వెంకటేశ్, ముత్యాల రాజశేఖర్, గంగని శ్రీనివాస్, క్యాదాస్ సతీశ్, దాసరమోని శ్రీధర్, నాగభూషణం, వెంకటేశ్ పాల్గొన్నారు.