హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు పార్టీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగం వృధాకాదని చెప్పారు.
ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగురామన్న పార్టీ కార్యాలయంపై జండా ఎగురవేశారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు పార్టీ జండా ఆవిష్కరించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అచ్చంపేటలో జరిగిన వేడుకల్లో విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ పార్టీ జండాను ఆవిష్కరించారు. సంగారెడ్డిలో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పార్టీ నేతలు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..