సంగారెడ్డి, ఏప్రిల్ 2 : దశాబ్దాల పాటు రోడ్లున్న ప్రతి గ్రామానికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిప్పినా ఆదాయం రాక నష్టాల ఊబీలో ఆర్టీసీ చిక్కుకున్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తొలి రోజుల్లో చర్యలు చేపట్టి నిధులు విడుదల చేసినా ఆర్టీసీకి నష్టాలు తగ్గలేదు. కార్గో సేవలు చేస్తే దండిగా ఆదాయం వస్తుందని చేసిన ప్రయత్నం చాలా గొప్పది. రోడ్డు మార్గం ఉన్నా ప్రతి గ్రామానికి బస్సులు నడిపి నష్ట పోయిన ఆర్టీసీ ఇప్పుడు కార్గో సేవలతో దండిగా ఆదాయం వస్తుందని, కార్మికుల జీతాలకు ఢోకాలేదని కార్మికులు దీమాలో ఉన్నా రు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రెట్టింపు ఉత్సాహంతో కార్మికులు తమ విధులను పై అధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నారు. ఆర్టీసీలో నూతనంగా కార్గో సేవలను కరోనా కష్ట కాలంలో జూన్ 19, 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు.
అప్పటి నుంచి రవాణా సేవలు నిరాటకంగా కొనసాగిస్తూ పార్సిళ్ల సేవల్లో ఆర్టీసీ తనదైన ముద్ర వేసుకున్నది. ప్రైవేట్ పార్సిల్ సర్వీసులకు దీటుగా ఆర్టీసీ సేవలు విస్తృతం చేసి సరుకుల రవాణాలో తాము ముందున్నామని చాలెంజ్ చేసే స్థాయికి ఎదిగింది. ఇందుకోసం ఆర్టీసీ యా జమాన్యం, అధికారులు, కార్మికులు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆదాయం పెంచడానికి చర్యలు చేపట్టారు. 9 నెల ల్లో మెదక్ రీజియన్ పరిధిలో 18 పాయింట్లను ఏర్పాటు చేసి 1,49,078 పార్సిళ్లను ఇంటింటికీ సరఫరా చేయడంతో రూ.1, 13,45,717 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. గతంలో బస్సు చక్రాలు రోడ్డుపై తిరిగితేనే కార్మికుల జీతాలు వచ్చేవని, ప్రస్తుతం అలా కాకుండా కేవలం పార్సిళ్లను వినియోగదారులు ఇచ్చిన అడ్రస్లకు చేరవేస్తే వచ్చే ఆదాయంతో వేతనాల చింతలేదనే దీమాలో కార్మికులు ఉండటం హర్షణీయం.
ఇంటింటికీ కార్గో సేవలు
సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఏదో విధంగా ఒకరి సేవలు ఉపయోగపడటం తప్పనిసరి. కుటుంబానికి అవసరమైన వస్తువులతో పాటు దూర ప్రాంతాలకు చేరవేసే సరుకులను పార్సిళ్లను ఆర్టీసీ చేరవేస్తున్నది. చిన్న గుండు సూది నుంచి బస్సుల్లో రవాణా చేసే వస్తువులన్నింటినీ విని యోగదారుల చిరునామాలకు చేరవేయడం గొప్పవిషయం.
18 పాయింట్లు.. 8 బస్సులు
మెదక్ రీజియన్ పరిధిలోని 8 డిపోల్లో 8 ప్రత్యేక కార్గో బస్సులతో 18 పాయింట్లను ఏర్పాటు చేసి పార్సిల్ సేవలను ఆర్టీసీ అందజేస్తున్నది. కార్గో రవాణాకు ఏర్పాటు చేసిన బస్సులతో పాటు ఆయా రూట్లలో నడుస్తున్న బస్సుల్లో వినియోగదారులు ఇచ్చిన చిరునామాకు పార్సిళ్లను అధికారులు చేరవేస్తున్నారు. సంగారెడ్డి డిపో పరిధిలో ఒకటి, సదాశివపేట, జోగిపేట బస్టాండ్లలో పాయింట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు సేవలు అందిస్తున్నారు. అలాగే జహీరాబాద్లో ఒకటి, నారాయణఖేడ్, పెద్ద శంకరంపేట, మెదక్ డిపోలతో పాటు నిజాంపేట్, నర్సాపూర్, రామాయంపేట్, చేగుంటలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట డిపో పరిధిలోని పాత, కొత్త బస్టాండ్లు, చెర్యాల్లో, దుబ్బాక డిపోలో, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, తూప్రాన్, హుస్నాబాద్ డిపోల పరిధిలో పాయింట్లను ఏర్పాటు చేసి పార్సిళ్లను సకాలంలో అందిజేస్తున్నారు. కరోనా లాంటి విపత్కర కాలంలో ప్రారంభించి తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయంపై దృష్టి పెట్టి ఆర్టీసీ రాబడికి దారులు వేయడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ కూడా చదవండి..
డ్రగ్ ట్రాఫికింగ్.. అధ్యక్షుడి సోదరుడికి జీవితఖైదు శిక్ష
ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై
హాంకాంగ్పై చైనా మళ్లీ కన్నెర్ర..
ప్రపంచ బట్టతల సోగ్గాడు.. ప్రిన్స్ విలియం
అధ్యక్షుడి చివరి చూపు కోసం వచ్చి 45 మంది మృతి