హైదరాబాద్: పంజాగుట్టలోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో ఉన్న దక్షిణామూర్తికి ఇవాళ ఆలయ పూజారులు ఘనంగా అభిషేకం చేశారు. ప్రతి గురువారం దుర్గాభవాని గుడిలో దక్షిణామూర్తికి అభిషేకం, అలంకరణలు జరుగుతాయి. అయితే ఇవాళ శ్రీరామనవమి కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు.
పంజాగుట్టలోని శ్రీ దుర్గాభవాని ఆలయంలో ఉన్న దక్షిణామూర్తికి ఇవాళ ఘనంగా అభిషేకం నిర్వహించారు. pic.twitter.com/GE6i2I6E2m
— Namasthe Telangana (@ntdailyonline) March 30, 2023
అధిక సంఖ్యలో భక్తులు దక్షిణామూర్తికి అభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారి ప్రసాద్ ఆధ్వర్యంలో పంచ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు. ఆ తర్వాత అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః
చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః