న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చుక్కెదురైంది. బొగ్గు కుంభకోణం కేసులో తమ ముందు హాజరుకావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిందని, ఈ సమన్లను తోసిపుచ్చేలా ఆదేశాలు జారీ చేయాలన్న ఆయన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్పై మూడు రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఈడీని కోర్టు కోరింది. పశ్చిమబెంగాల్లో జరిగిన బొగ్గు కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీ పాత్ర ఉన్నదని పేర్కొంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో హవాలా లావాదేవీలపై దృష్టిసారించిన ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.