న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన బీజేపీ అగ్రనేతలు బెంగాల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ముఖం చాటేశారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్ లో పిడుగుపాటుకు గురై మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరిటాకుల్లో భోజనం చేస్తూ ఫోటోలు దిగిన అమిత్ షా సహా ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. బాధితులకు ప్రధాని మోదీ ఆర్ధిక సాయం ప్రకటించే లోపే టీఎంసీ ప్రభుత్వం బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం అందచేసిందని అన్నారు. ఇక సోమవారం దక్షిణ బెంగాల్ లో పిడుగుపాటుకు గురై 27 మంది మరణించారు.