న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాజిందర్నగర్ ఎమ్మెల్యే, ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్ రాఘవ్ చద్ధా కరోనా బారినపడ్డారు. గురువారం నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు వైరస్ పాజిటివ్గా తేలింది. అయితే తనకు లక్షణాలు కనిపించలేదని, ముందస్తు జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అలాగే వైరస్ ఇతరులకు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.