పనాజీ: వచ్చే ఏడాది జరుగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఆ ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని మొత్తం 40 స్ధానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వెల్లడించారు. గోవాలో ప్రతిపక్షం బలహీనంగా తయారైందని తామే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగామని ఆయన అన్నారు. అంతకుముందు మనీష్ సిసోడియా గోవా మాజీ ముఖ్యమంత్రులు దయానంద్ బందోద్కర్, మనోహర్ పారికర్లకు నివాళులు అర్పించారు. అవినీతి రహిత రాజకీయాలను కోరుకునే వారంతా ఆప్లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
కరోనా కేసులలో బ్రెజిల్ను దాటేసిన భారత్..!
కరోనా ఎఫెక్ట్: అక్కడ 10th, 12th పరీక్షలు వాయిదా
నాకు పాజిటివ్ వచ్చిందా.. పకోడీలు వేశాక వస్తాలే..!
కరోనాతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
వింత ఆచారం: దున్నపోతుతో తొక్కించుకుంటే మంచి జరుగుతుందట..!
నూకాలమ్మ జాతరలో గిరినాగు ప్రత్యక్షం.. భయం