న్యూఢిల్లీ : ఆప్, కాంగ్రెస్ల వ్యతిరేకత నడుమ ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత (ఎన్సీటీ) సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన అనంతరం రాజ్యసభలో ఈ బిల్లును అడ్డుకోవాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షలు, ఎన్డీయేతర పక్షాలకు విజ్ఞప్తి చేశారు. పెద్దల సభలో ఈ బిల్లును ప్రతిఘటించాలని కేజ్రీవాల్ అభ్యర్ధించారు. రాజ్యసభలో ఎన్సీటీ బిల్లును వ్యతిరేకించాలని విపక్షాలతో పాటు ఎన్డీయేతర పార్టీలతో సంప్రదింపులను ఆప్ ముమ్మరం చేసింది.
లెఫ్టినెంట్ గవర్నర్కు సర్వాధికారాలు కట్టబెట్టే ఎన్సీటీ బిల్లు రాజ్యాంగవిరుద్ధమైనదని ఆ పార్టీ అభివర్ణించింది. ఎన్సీటీ బిల్లు ప్రజాస్వామ్యానికి చేటని కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. వివాదాస్పద బిల్లుపై పార్టీ వైఖరిని సమర్ధించేలా పార్టీ సభ్యులందరూ సభలో ఉండాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. ఢిల్లీ అధికారాలను కుదించేలా కేంద్రం చేపట్టిన చర్యలు ప్రజాస్వామ్యానికి చెంపపెట్టని కాంగ్రెస్ పార్టీ నేత అభిషేక్ మను సింఘ్వి ట్వీట్ చేశారు.