న్యూఢిల్లీ : త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (AAP @ UP) పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉత్సాహంగా ఉన్నది. అటు పంజాబ్లో కూడా అమీతుమీకి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచి కాంగ్రెస్ కన్నా ముందున్నామని చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరుపడం లేదని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ఇప్పటికే స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే ఆప్ బలంగా ఉన్నది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు రాగా, మాకు 83 పంచాయతీల్లో విజయం సాధించాం. 1600 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఆప్ 40 లక్షలకు పైగా ఓట్లను సాధించింది’ అని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. దాదాపు 100, 150 నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను నియమించి కోర్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని విస్తరించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆప్ యూపీ నుంచి అభ్యర్థులను రంగంలోకి దింపినప్పటికీ ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం పంజాబ్లో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదిగింది. ఇదే తరహాలో గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్లో కూడా విజయం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది. 2014 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపైనే పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు.
టీవీ యాంకర్గా నటుడు సోనూ సూద్.. ఏ ఛానల్లో.. ఏ ప్రోగ్రాంలో..?
ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా : అన్నే హిడాల్గో
విప్రోలో ముగిసిన వర్క్ ఫ్రం హోం
పైలట్ తప్పిదం వల్లనే విమానం ప్రమాదం
పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై దృష్టిపెట్టండి : వెంకయ్యనాయుడు
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లెబనాన్
గణనాథుల కలెక్షన్స్తో గిన్నిస్ బుక్కులోకి డెంటిస్ట్
1500 మందితో పాట షూటింగ్.. ఒక్కరికీ కరోనా రాలేదు! ఎందుకంటే?
14 వేల మంది పఠాన్లును నిలువరించిన 21 మంది సిక్కు జవాన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..