బాలీవుడ్ నటుడు చుంకీ పాండే నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఈ అమ్మడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో నటిస్తుంది. కరోనా వలన లాక్డౌన్ ప్రకటించడంతో కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ మరి కొద్దిరోజులలో లైగర్ షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమైంది.
నేటితరంలో స్పీడున్న భామగా అనన్య పాండే పేరు పాపులరైంది. భారీ క్రేజీ ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న అనన్య తాజాగా తన ఇన్స్టా వేదికగా రెడ్ హాట్ బికినీ ఫొటోలని షేర్ చేసింది. మాల్దీవుల విహారం నుంచి అనన్య పాండే బికినీ ఫోజులు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజగా అనన్య షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.