అమరావతి : కడప జిల్లాలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మధ్యాహ్నం మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలోని బైరటీస్ గని వద్ద ఈ ఉదయం జిలిటెన్స్టిక్స్ పేలిన విషయం తెలిసిందే. ముగ్గురాళ్ల గనిలో పేలుళ్లు జరిపేందుకు బద్వేలు నుంచి వాహనంలో జిలిటెన్స్టిక్స్ తీసువచ్చారు.
కూలీలు వీటిని అన్లోడ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో ఘటనాస్థలంలోనే 9 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడగా బాధితులను చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. వీరిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.