బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో శుక్రవారం 21 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం ఆ కాలేజీలోని 48 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 21 మందికి పాజిటివ్గా తేలింది. పాజిటివ్ వచ్చిన విద్యార్థులతంగా గత నెల 17 నుంచి 21 నుంచి కేరళ నుంచి వచ్చినవారేనని జిల్లా అధికారులు తెలిపారు. అయితే, కరోనా పాజిటివ్ వచ్చినా వాళ్లలో ఎవరికీ సింప్టమ్స్ లేవని చెప్పారు.
కాగా, ఒకే నర్సింగ్ కాలేజీలో 21 మందికి పాజిటివ్ రావడంతో అధికారులు హసన్ జిల్లాలోని 9 నర్సింగ్ కాలేజీల్లోగల 900 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. ఆ 900 మందిలో 100 మందికి పాజిటివ్గా తేలింది. వారిలో 24 మంది మొదట పాజిటివ్గా తేలిన 21 మందికి ప్రైమరీ కాంటాక్ట్స్ అని ఆరోగ్య అధికారి డాక్టర్ విజయ్ వెల్లడించారు. ఆ 24 మంది తొలి డోసు టీకా వేయించుకున్న వారేనని చెప్పారు.