అగర్తలా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐ-ప్యాక్కు చెందిన 23 మంది సభ్యులను త్రిపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగర్తాలాలోని హోటల్ వుడ్ల్యాండ్ పార్క్లో ఉన్న వీరిని ఆదివారం రాత్రి నుంచి అక్కడే ఉంచి ప్రశ్నించారు. త్రిపురకు ఎందుకు వచ్చారు అని ఆరా తీశారు. హోటల్ను విడిచి వెళ్లవద్దని అగర్తలా పోలీసులు వారిని హెచ్చరించారు. రాష్ట్రం విడిచి వెళ్ళడానికి విమానాశ్రయానికి మాత్రమే వెళ్లవచ్చని చెప్పారు.