ఔరంగాబాద్, ఫిబ్రవరి 2: వెయ్యేండ్ల క్రితం నాటి జైనుల ఆరాధ్యదైవం కుంతునాథ్ రాతి విగ్రహం ఒకటి మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బయటపడింది. జైన మతం ప్రకారం.. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ను 17వ తీర్థంకరుడిగా చెప్తారు. ఔంధ నాగనాథ్ పట్టణంలోని ఓ జైన ఆలయం పరిసరాల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా దీన్ని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. బసాల్ట్ రాయిపై చెక్కిన ఈ శిల్పం.. దానిపై ఉన్న మేక గుర్తు ప్రకారం కుంతునాథ్ భగవాన్ది గుర్తించినట్టు పురావస్తు శాస్త్రవేత్త పలందే దాతర్ తెలిపారు.