జైపూర్: కరోనా టీకా వేయించుకున్నవారికి ఒక రెస్టారెంట్ డిస్కౌంట్ ఇస్తున్నది. రాజస్థాన్ జోధ్పూర్లోని వేదిక్ రెస్టారెంట్లో టీకా తీసుకున్నవారికి బిల్లులో తగ్గింపు ఇస్తున్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారికి పది శాతం, రెండు డోసులు తీసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేశారు. కరోనా టీకా వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెస్టారెంట్ యజమాని అనిల్ కుమార్ తెలిపారు. మరోవైపు రాజస్థాన్కు చెందిన కొన్ని వ్యాపార సంస్థలు టీకా తీసుకున్నవారికి ఇటీవల పలు రకాల బహుమతులు, ఆఫర్లు ఇచ్చాయి.