బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూనే ఉన్నది. దాంతో అందుకు తగినట్లుగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది. అయితే కొందరు రెండు డోస్ల వ్యాక్సిన్లు తీసుకున్నా కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా కర్ణాటకలో అలాంటి ఘటనే చోటుచేసుకున్నది.
ఇటీవలే రెండు డోస్ల టీకాలు కూడా తీసుకున్న ఓ కానిస్టేబుల్ రెండు వారాల క్రితం కరోనా మహమ్మారి బారినపడ్డారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన.. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో ప్రాణాలు కోల్పోయాడని మంగళూరు పోలీస్ కమిషనర్ శశి కుమార్ తెలిపాడు.