అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 11వ తేదీ నుంచి టీకా ఉత్సవ్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దాని కోసం 25 లక్షల కోవిడ్ టీకా డోసులను తమకు ఇవ్వాలంటూ ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరారు. ఏప్రిల్ 9వ తేదీన రాసిన లేఖలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని మీరు ఇచ్చిన పిలుపు చాలా అత్యవసరమైందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని భారీ సంఖ్యలో పాల్గొనాలనుకుంటున్నామని, ప్రతి గ్రామంలోని ఓ వార్డులో ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్న కేంద్రంలో ఈ టీకా ఉత్సవ్ జరుగుతుందని సీఎం జగన్ తన లేఖలో తెలిపారు. అయితే ఏపీలోని అనంతపుర్, కర్నాల్ జిల్లాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. చాలా వరకు ప్రైవేటు హాస్పిటళ్లు ఆ జిల్లాలో వ్యాక్సిన్ ఇవ్వడం నిలిపివేశాయి. ఇక ప్రభుత్వ దవాఖానాల్లో కేవలం రెండు రోజులకు సరిపడా డోసులు ఉన్నట్లు తెలుస్తోంది.