గోల్నాక, జూన్ 21 : నేటి అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో వరద నీటి పైపులైన్ల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. సోమవారం అంబర్పేట డివిజన్ ప్రేమ్నగర్లో రూ.10.60 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వరద నీటి పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాల్లో భవిష్యత్లో ఎలాంటి ముంపు సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్లో వరద ముంపు సమస్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముంపునకు కారణమవుతున్న సీపీఎల్ మూసీ నాలా విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇటీవలే సీపీఎల్ అధికారులతో మాట్లాడి వారి అనుమతి తీసుకున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సంతోష్, ఏఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గతో పాటు టీఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, ఆమనూరి సతీశ్, రాగుల ప్రవీణ్, మహేశ్ముదిరాజ్, మల్లికార్జున్యాదవ్, మహేశ్, సింహాచలం, పాక నర్సింగ్, సూరి, రంగు ఉదయ్గౌడ్, గౌస్, బాలరాజు, యూసుఫ్బాబా తదితరులు పాల్గొన్నారు.