హిమాయత్నగర్కు చెందిన ప్రతీక ఈ ఆదివారం ఫ్యామిలీతో అన్నవరం వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వాహనాన్ని మాట్లాడుకున్నారు. అక్కడ ఉండేందుకు గదులను కూడా బుక్ చేసుకున్నారు. కానీ ప్రభుత్వం కర్ఫ్యూ విధించాక ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. వెళ్లే వీలున్నప్పటికీ కొవిడ్ పొంచి ఉండటంతో ధైర్యం చేయలేకపోయారు.
కీర్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి. గోవాకు వెళ్లాలని స్నేహితులతో కలిసి ప్లాన్ చేసుకుంది. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంది. అందుకోసం మినీ బస్సును మాట్లాడింది. కానీ కర్ఫ్యూ పరిస్థితులు వారిని పునరాలోచనలో పడేశాయి. వారి తల్లిదండ్రులు కూడా వద్దని వారించడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
కరోనా విజృంభణతో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించడంతో బయటకు వెళ్లాలంటే నగరవాసులు సాహసించడం లేదు. మరీ ముఖ్యంగా వీకెండ్ సరదాలు, లాంగ్ టూర్లు, ఫ్యామిలీ ట్రిప్పులను రద్దు చేసుకుంటున్నారు. ప్రతీ వీకెండ్లో ఎంజాయ్ చేసే నగరవాసులు మరికొన్ని రోజులు పర్యాటక, ఫ్యామిలీ టూర్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు.