ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బోయ్సర్-తారాపూర్ ఏరియాలో సినాయ్ కంపెనీ బయట ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ బయట నిలిపి ఉంచిన ఒక కెమికల్ ట్యాంకర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే అక్కడే ఉన్న ప్లాస్టిక్ పైపులకు ఆ మంటలు అంటుకున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఐదు ఫైరింజన్లు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.