శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కశ్మీర్లోని ఉధంపూర్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తానికి విస్తరించడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. గత రెండు గంటలుగా మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నామని ఐఏఎఫ్ వారంట్ ఆఫీసర్ దల్బీర్ ఎస్ బేహల్ చెప్పారు. మంటలను అర్పడానికి చాలా సమయం పడుతుందని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు.