చెన్నై: కరోనా వైరస్ కారణంగా తమిళనాడులోని అరిగ్నర్ అన్నా జూపార్క్లో ఓ మగ సింహం చనిపోయింది. అంతకుముందే కరోనా లక్షణాలు కనిపించడంతో దాని నుంచి శాంపిల్ సేకరించి టెస్ట్ కోసం పంపగా.. అది పాజిటివ్గా తేలింది. అయితే రిపోర్ట్ తప్పుగా కూడా వచ్చే అవకాశం ఉన్నదని, సింహం దీర్ఘకాల వ్యాధులతో చనిపోయి ఉండొచ్చని ఓ జూ అధికారి చెప్పారు. రెండో శాంపిల్ను ఇన్స్టిట్యూట్కు పంపిస్తామని ఆయన తెలిపారు. గత వారం ఈ సింహం అనారోగ్యానికి గురైంది.
దానిని చూసి కరోనా సోకినట్లు అనుమానించిన సిబ్బంది.. శాంపిల్ను భోపాల్లోని ల్యాబ్కు పంపించారు. అక్కడే ఉన్న ఇతర సింహాల శాంపిళ్లు కూడా పాజిటివ్గా తేలినట్లు జూ సిబ్బంది వెల్లడించారు. అయితే వాటికి కరోనా ఎలా సోకిందన్న దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గత నెలలో హైదరాబాద్ జూలో కూడా 8 సింహాలకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.