చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయింబత్తూరులోని కరమడాయ్ రేంజ్ అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. చిరుత ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది వేటగాళ్ల పని కాదని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఏదైనా కలుషిత ఆహారమో, లేదంటే విషాహారమో తిని మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా, చిరుత అనుమానాస్పద మృతిపై అటవీశాఖ దర్యాప్తు చేపట్టింది. చిరుత కళేబరానికి పోస్ట్మార్టం నిర్వహించి దాని మృతికిగల కారణం తెలుసుకోనున్నట్లు ప్రకటించింది.