చెన్నై: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జూపార్కులో అత్యంత అరుదైన దృశ్యం వెలుగు చూసింది. ఆ జూలోని ఓ మొసలి ఒకేసారి 14 పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఆ జూలోని మొసళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. మొసళ్లు గుడ్లుపెట్టి పిల్లలు చేస్తాయి. అయితే ఒక మొసలి ఒకే తేపకు ఐదారు పిల్లలు చేయడం సాధారణమే అయినా.. కోయంబత్తూరు జూలోని ఈ మొసలి మాత్రం ఏకంగా 14 పిల్లలు చేయడం విశేషం. ఆ మొసలి, దాని పిల్లలు జూలో చేస్తున్న సందడిని ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.