న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సీఎం మమతా బెనర్జీకి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. మరోసారి అధికారం చేపట్టనున్న ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
కేరళలో ఎల్డీఎఫ్ విజయం సాధించడంతో సీఎం పినరయి విజయన్కు, తమిళనాడులో లీడ్లో ఉన్న డీఎంకే నేత స్టాలిన్కు, అస్సాంలో బీజేపీని మరోసారి గెలిపించిన సీఎం సర్బానంద సోనోవాల్తోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ కార్యకర్తలకు రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.