న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. రష్యా భద్రతాధికారి నికోలోయ్ పాత్రోసేవ్ మధ్య ఇవాళ ఢిల్లీలో సమావేశం జరిగింది. రెండు దేశాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు కూడా భేటీ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న పరిణామాలపై ఎన్ఎస్ఏ అధికారులు చర్చించారు. చైనా, పాకిస్థాన్ అంశాలపైన కూడా రెండు దేశాల అధికారులు చర్చించనున్నారు. రష్యా భద్రతా మండలిలో కార్యదర్శిగా ఉన్న పాత్రోసేవ్ మంగళవారం సాయంత్రం ఇండియాకు వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీని కూడా కలవనున్నారు.
రష్యాకు చెందిన ఎన్ఎస్ఏ.. పుతిన్కు నమ్మకంగా ఉంటుంది. ఇండియన్ చీఫ్ దోవల్తోనూ రష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉత్పన్నమయ్యే ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్తో రష్యా కలిసి పనిచేయనున్నది. అన్ని దేశాల తరహాలోనే, ఆఫ్ఘనిస్తాన్లో సమగ్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రష్యా కూడా భావిస్తున్నట్లు పాత్రోసేవ్ తెలిపారు.