హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీపై నూతన విధానం రూ పొందించిందని, దానిని త్వరలోనే ప్రకటిస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. కరోనా సమయం లో ఐటీ కంపెనీలకు సరికొత్త అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. శుక్రవారం మాదాపూర్లోని నోవాటెల్ హెచ్ఐసీసీలో జరిగిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసి యా)- బిజ్ సమ్మిట్-2021లో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్ర దుష్ప్రభావం చూపినా ఐటీ రంగానికి కొత్త అవకాశాలు కల్పించిందని చెప్పారు. సమావేశంలో కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ రాజేశ్ నంబియార్, కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సౌరబ్ గౌర్ తదితరులు పాల్గొన్నారు.