న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.9,096 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.7,703 కోట్ల లాభంతో పోలిస్తే 18 శాతం అధికమని పేర్కొంది. గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.41,436.36 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.38,438.47 కోట్లుగా ఉన్నది.