మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 5 : సీఎం సహా య నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో నియోజకవర్గంలోని 47 మందికి మంజూరైన రూ. 16, 76, 500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ ప్రమాదాలకు గురైన వారు, ఇతర అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ దవాఖానల్లో శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహా య నిధికింద సాయం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ఇది బాధితులు కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
రోడ్డు వెడల్పు పనులకు భూమిపూజ
మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని 31వ వార్డు గోసేవా మండలిలో రూ. 3.30 లక్షలు ఎల్ఆర్ఎస్ నిధులు వెచ్చించి చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులకు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ పెంట రాజ య్య, వైస్ చైర్మన్ ముఖేశ్గౌడ్, కౌన్సిలర్ సురే శ్ బల్దవా, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు బొలిశెట్టి కిషన్, కార్కూరి చంద్రమౌళి, పడాల రామన్న, వెంకటేశ్వరరావు మార్వాడీ ప్రగతి సమాజ్ అధ్యక్షుడు బ్రిజ్మోహన్ రెణ్వా పాల్గొన్నారు.