అమృత్సర్: తీర్థయాత్ర కోసం భారత్కు వచ్చి కరోనా వల్ల చిక్కుకుపోయిన పాకిస్థాన్కు చెందిన 98 మంది హిందువులు ఏడాదిన్నర తర్వాత ఆదివారం బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల మూడో తేదీనే వారు పంజాబ్లోని అట్టారి-వాఘా సరిహద్దు మీదుగా పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఆర్టీ-పీసీఆర్ పరీక్షల రిపోర్ట్ లేకపోవడంతో వారిని అనుమతించలేదని ప్రోటోకాల్ అధికారి చెప్పారు.
కాగా, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ను సందర్శించేందుకు గత తాము ఏడాది భారత్కు వచ్చామని పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లోని సంఘర్ జిల్లాకు చెందిన వజీర్ తెలిపారు. కరోనా లాక్డౌన్ వల్ల ఇక్కడ చిక్కుకుపోయినట్లు చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో తాము బస చేశామని అన్నారు. ఎట్టకేలకు కరోనా పరీక్షలు నిర్వహించి తమను పాక్కు తిరిగి పంపేందుకు సహకరించిన భారత ప్రభుత్వానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.