హుజూరాబాద్, ఏప్రిల్ 16 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. రైతులు కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, వీణవంక మండలాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిల్లర్లు తిరకాసు పెట్టకుండా రైతుల ధాన్యాన్ని తీసుకోవాలని, ఇబ్బందిపెడితే చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.