ధూమపాన ప్రియులకు మహమ్మారి ముప్పు తక్కువ
సీఎస్ఐఆర్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: పొగతాగేవారు, శాకాహారులు, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి కరోనా వైరస్ సోకే ముప్పు తక్కువట! ఈ విషయాన్ని వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. కొవిడ్-19 శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ మ్యూకస్ను ఉత్పత్తి చేయడం వల్ల ధూమపానం మొదటి రక్షణగా నిలుస్తున్నదని పేర్కొంది. అయితే ఈ పరిశీలనను ఆమోదంగా తీసుకోకూడదని, నికోటిన్ ప్రభావం గురించి ఇంకా లోతైన అధ్యయనాలు చేయాల్సి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఫైబర్ అధికంగా కలిగిన శాకాహారం.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనంలో తేలింది. ‘బీ’, ‘ఏబీ’ బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులకు కరోనా సోకే ముప్పు ఎక్కువని, ‘ఓ’ బ్లడ్ గ్రూపు వారికి మాత్రం ప్రమాదం తక్కువని గుర్తించారు. సీఎస్ఐఆర్ సర్వేలో భాగంగా వ్యక్తుల్లో కరోనా వైరస్ను ఎదుర్కోగల యాంటీ బాడీస్ గురించి అధ్యయనం చేశారు.