ఏపీకి చెందిన ఓ సంస్థకు లింకు!
అహ్మదాబాద్, సెప్టెంబర్ 19: గుజరాత్లోని ముంద్రా పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. శరీర సౌందర్యానికి వాడే టాల్కమ్ పౌడర్ ముసుగులో దీన్ని అఫ్గానిస్థాన్ నుంచి ముంద్రా పోర్టుకు స్మగ్లింగ్ చేసినట్టు సమాచారం అందుకున్న అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా దాదాపు రూ.9,000 కోట్ల విలువైన హెరాయిన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ సంస్థ దీన్ని దిగుమతి చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే సదరు సంస్థ నిజంగా టాల్కమ్ పౌడర్ను ఆర్డర్ చేసిందా? లేక ఈ పౌడర్ ముసుగులో హెరాయిన్ను దిగుమతి చేసుకుందా? అన్న విషయాన్ని తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.