బేగంపేట్, జూన్ 12: తెలంగాణ ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద శనివారం 201 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 48 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. సీఏం కేసీఆర్ పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కఆ లేని విధంగా పేదింటి ఆడపడుచుల వివాహాలకు ప్రభుత్వ పరంగా చేయూత నివ్వాలనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. రూ. లక్ష నూట పదహార్లు ఆర్థిక సహాయంగా అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, మహేశ్వరి, చీర సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
అమీర్పేట్, జూన్ 12 : కరోనాతో పోరాడుతూ మృ తి చెందిన వార్త దినపత్రిక బ్యూరోచీఫ్ కావటి వెంకట్ మృతి తనను కలచివేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అంశాలకు ప్రజలకు చేరవేయడంలో కావటి వెంకట్ జర్నలిస్ట్గా ఎంతో కృషి చేశారని, ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శనివా రం ఉదయం మారేడ్పల్లిలోని తన నివాసంలో కలిసేందుకు వచ్చిన కావటి వెంకట్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ రూ. ఒక లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కొవిడ్తో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కు టుంబసభ్యులకు మంత్రి తలసాని రూ.లక్ష ఆర్థికసా యం చేశారు. శనివారం ఉదయం తనను కలిసిన కందికొండ యాదగిరి కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ కిమ్స్ వైద్యులతో మంత్రి ఫోన్లో మాట్లాడి యాదగిరి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్యాన్ని అందించాలని వైద్యులకు సూచించారు.