అహ్మదాబాద్, జూలై 24: గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు చిన్నారులు సహా మొత్తం 9 మంది దుర్మరణం చెందారు. గుజరాత్లోని అహ్మదాబాద్ శివారులో ఈ దారుణం చోటుచేసుకున్నది. మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఒకే గదిలో గురువారం రాత్రి నిద్రపోయారు. గదిలో గ్యాస్ లీకేజీ అవుతుందని వాసన గమనించిన పక్కింటి వ్యక్తి వీరిని లేపారు. తలుపుతీసి వెంటనే లైట్ వేయడం, అప్పటికే గదినిండా గ్యాస్ వ్యాపించి ఉండటంతో భారీ పేలుడు సంభవించింది. అప్రమత్తం చేసిన వ్యక్తి కూడా గాయపడ్డాడు.