పల్లెల్లో పేదలకు చేతినిండా పని
జిల్లాలో 1,54,731 జాబ్కార్డులు
వేసవి భత్యం పెంపుతో ముమ్మరంగా పనులు
మోత్కూరు, మార్చి 31 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలు, పట్టణాలకు వల స వెళ్లిన వారు కొవిడ్-19 కారణంగా తిరిగి తమ సొంత గ్రామాలకు వచ్చారు. దీంతో గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న ఉపాధి హామీ పనులు ప్రస్తుతం ఆసరాగా మారాయి. ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించడంతో పాటు రోజుకు రూ.237వరకు కూలిగిట్టుబాటయ్యేలా పనికల్పించాలని ప్రభు త్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో అధికారు లు గ్రామాల్లో ఉపాధిహామీ పనులు చేపడుతున్నారు. అడిగిన వారికి పనులు కల్పిస్తున్నారు.
జాబ్ కార్డులు 1,54,731
జిల్లాలో 1,54,731 మంది ఉపాధి హామీ జాబ్కార్డులు కలిగి ఉన్నారు. వీరిలో 3,34,827 మంది పనుల కోసం నమోదు చేసుకున్నారు. 2,929 శ్రమ శక్తి సంఘాలు ఉండగా ప్రస్తుతం 8,446 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు సీజన్ ముగియడంతో కూలీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కూలీలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేస్తుండగా, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు పనులు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
వేసవి భత్యం పెంపు
మండుటెండల్లో పని చేసిన వారికి వేసవి భత్యం అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలు జరీ చేసింది. దీంతో గ్రామాల్లో ఉపాధి హామీ పనుల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఫిబ్రవరిలో పని చేసిన కూలీలకు 20 శాతం అదనంగా చెల్లింపులు జరుగగా, మార్చిలో పని చేసిన వారికి 25శాతం, ఏప్రిల్, మేలో 30శాతం, జూన్లో 20శాతం అదనంగా కూలీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పని ప్రదేశంలో మెరుగైన వసతులు కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వడదెబ్బ తగలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేస్తున్నారు. తాగు నీరు, నీడ వంటి వసతులు కల్పిస్తున్నారు.
గిట్టుబాటయ్యేలా చూస్తున్నాం
గ్రామాల్లో ఈజీఎస్ పనులకు వచ్చే కూలీల సంఖ్య గతంలో కంటే పెరిగింది. ప్రతిఒక్కరికీ కూలి గిట్టుబాటయ్యేలా చర్య లు తీసుకుంటున్నాం. వేసవిలో పనికి వచ్చే కూలీలకు అదనంగా భత్యం పెంచడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రజలు ఉపాధి హామీ పథకా న్ని సద్వినియోగం చేసుకోవాలి.
అడిగిన వారందరికీ పని
గ్రామాల్లో ఉపాధి పనులు అడిగిన వారందరికీ పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గతేడాది కంటే ఈ సంవత్స రం కూలీల సంఖ్య పెరిగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పనులు జరిగేలా చూస్తు న్నాం. వలస కూలీలకు సైతం జాబ్కార్డు ఇచ్చి పనులు కల్పిస్తున్నాం.