అమరావతి : రోడ్డు ప్రమాదంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్డంతో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్పగాయాలయ్యాయి.
అనంతగిరి మండలం కరకవలసలో పరిషత్ ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి