అమరావతి : ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో రేపటి నుంచి కొవిడ్ ఆంక్షలు విధిస్తున్న ఆలయ ఈఓ త్రినాథరావు బుధవారం తెలిపారు.
10 ఏండ్ల లోపు పిల్లలను, 60 ఏళ్లు దాటిన వారిని ఆలయ పరిసరాల్లోకి అనుమతించమని వెల్లడించారు. ప్రసాద పంపిణీ, విక్రయ కౌంటర్లను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
స్వామివారి అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భక్తులు, ఆలయ సిబ్బంది ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆంక్షలను గుర్తించి భక్తులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి