న్యూఢిల్లీ, జూన్ 15 : కేంద్రప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనలను 800కు పైగా సోషల్మీడియా సంస్థలు, ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలు అంగీకరించాయి. ఈ క్రమంలో నిబంధనల్లో నిర్దేశించిన మేరకు గ్రీవెన్స్, నోడల్ అధికారులను నియమించాయి. ఈ జాబితాలో లింక్డ్ఇన్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, షేర్చాట్, చింగారీ, గూగుల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, జియో, కూ తదితర సంస్థలు ఉన్నాయి. నిబంధనల మేరకు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ (సీసీవో), నోడల్ కాంటాక్ట్ పర్సన్ (ఎన్సీపీ), రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసర్ (జీవో) పేర్లను ఇప్పటికే ఆయా సంస్థలు ప్రభుత్వానికి సమర్పించాయి.
ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం ట్విట్టర్కు సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ కాంప్లెక్స్లో శుక్రవారం సాయంత్రం జరిగే విచారణకు హాజరుకావాలని పేర్కొంది. సోషల్మీడియా, అన్లైన్ వార్తా సమాచార దుర్వినియోగాన్ని ఎలా అడ్డుకోవాలన్న అంశంపై ట్విట్టర్ ప్రతినిధి తగిన ప్రణాళికతో రావాలని ఆదేశించింది.