మూడోవేవ్కు ముకుతాడు వేసేందుకు కార్యాచరణ
‘లాన్సెట్’లో 21మంది నిపుణుల సూచనలు ఆరోగ్యసేవల వికేంద్రీకరణ, పారదర్శకంగా చికిత్స ధరలు, ప్రచారంలో శాస్త్రీయ సమాచారం, ప్రజల భాగస్వామ్యం..
న్యూఢిల్లీ : దేశంలో రెండోదశ సృష్టించిన అల్లకల్లోలం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నది. అయితే, అజాగ్రత్తగా ఉంటే.. సెకండ్వేవ్ను మించిన థర్డ్వేవ్ భారత్ను కమ్ముకొనే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ కొత్త మ్యుటేషన్లకు లోనవుతున్న నేపథ్యంలో మూడోవేవ్ ముప్పును కొట్టిపారేయలేమంటున్నారు. కొత్త కరోనా ఉత్పాతాన్ని ఎదుర్కోవడానికి భారత్ అత్యవసరమైన చర్యలు చేపట్టాలని 21 మంది నిపుణులతో కూడిన బృందం ‘లాన్సెట్’ వెబ్సైట్లో హెచ్చరించింది. కరోనా కట్టడికి భారత్ చేపట్టవలసిన ముఖ్యమైన ఎనిమిది సూత్రాలను సూచించింది. ఈ బృందంలో బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుమ్దార్ షా, ప్రముఖ సర్జన్ డాక్టర్ దేవిశెట్టి తదితరులు ఉన్నారు.
మహమ్మారి కట్టడికి నిపుణులు సూచించిన ఎనిమిది సూత్రాలు