చౌటుప్పల్, మే23 : కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎంతో మంది ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలు 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనదారులపై కేసులు నమోదు చేయడంతోపాటు బైకులను సీజ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ రహదారులపై పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారమే వాహనాలు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. చౌటుప్పల్ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం గూడ్స్ వాహనాలను రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆక్సిజన్, డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ల వాహనాలు, ఆక్సిజన్ , పెట్రోల్ ట్యాంకర్లు, నీటి ట్యాంకర్లు, వైద్య పరికరాల వాహనాలను లాక్డౌన్లో మినహాయింపు ఉండటంతో అనుమతిస్తున్నారు.
చౌటుప్పల్లో కట్టుదిట్టంగా లాక్డౌన్..
ఏసీపీ సత్తయ్య పర్యవేక్షణలో సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ ముని చౌటుప్పల్ జాతీయ రహదారిపై లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్లో మినహాయింపు ఉన్న వాహనాలను వదిలిపెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వచ్చే వాహనదారులకు జరిమానా విధించి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 36 ఫోర్వీలర్, 50 టూవీలర్ వాహనదారులకు రూ. 96,800 జరిమానా విధించి, 16 వాహనాలను సీజ్ చేశారు.
ఆత్మకూరు(ఎం)లో కఠినంగా ..
ఆత్మకూరు(ఎం), మే 23: మండలంలో లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ఉద యం 10 గంటల నుంచి ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారా యి. నిబంధనలు అతిక్రమించిన వాహనాలను పోలీసులు సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
నిర్మానుష్యంగా ప్రధాన వీధులు
రామన్నపేట, మే23: మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా జరుగుతున్నది. వ్యాపారులు ఉదయం 6 నుంచి 10 గంట ల వరకు షాపులను తెరిచి అనంతరం మూసివేశారు. 10 గంటల తర్వాత ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. చెక్ పోస్ట్ వద్ద ఎస్ఐ చంద్రశేఖర్ వాహనాల తనిఖీ నిర్వహించి నిబంధన లు ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించారు.
తుర్కపల్లిలో వాహనాల తనిఖీ
తుర్కపల్లి, మే23 : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామా ల్లో లాక్డౌన్ ప్రశాంతంగా జరిగింది. వ్యాపారులు ఉద యం 6నుంచి 10గంటల వరకు దుకాణాలను తెరిచి ఉంచా రు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు ఎస్ఐ మధుబాబు ఆధ్వర్యంలో పోలీసులు చలానాలు విధించారు.
చెక్ పోస్టు వద్ద ..
బొమ్మలరామారం, మే23: మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం లాక్డౌన్ ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో ప్రశాంతం గా జరిగింది. ఉదయం 10గంటల తర్వాత రోడ్ల పైకి వచ్చిన వాహనాలను చెక్పోస్టు వద్ద నిలిపివేశారు. వాహనాలు తని ఖీ నిర్వహించి లాక్డౌన్పై వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా లాక్డౌన్
సంస్థాన్ నారాయణపురం, మే23: మండలంలో లాక్డౌన్ 12వ రోజు ప్రశాంతంగా జరిగింది. ఉదయం 6 షాపులను తెరిచి 10 గంటల లోపు ముసివేశారు. సీఐ వెంకటయ్య ఆధ్వర్యంలో గుడి మల్కాపురం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
రాజాపేటలో ..
రాజాపేట, మే 23 : మండలంలో లాక్డౌన్ 12వ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ప్రజలు ఇండ్లకే పరిమి తం కావడంతో వీధులు నిర్మానుష్యంగా మారాయి. ఉద యం 6నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు వేళ ల్లో ప్రజలు నిత్యావసరాలను కొనుగోలు చేశారు.
బీబీనగర్లో..
బీబీనగర్, మే 23: మండలంలోని గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా తిరిగిన 80 మంది వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్ఐ రాఘ వేందర్గౌడ్ తెలిపారు.
అడ్డగూడూరులో..
అడ్డగూడూరు,మే 23 : మండలకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్డౌన్ 12వ రోజు ప్రశాంతంగా జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల పైకి వచ్చిన ఐదుగురి వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి 15 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు.