ముషీరాబాద్, మార్చి 13: దళితులను విద్య వైపు నడిపించడమే లక్ష్యంగా సోమవారం నుంచి నిర్వహించనున్న భీందీక్షలో పాల్గొనాలని ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి దీక్షల కరపత్రాలను ఆవిష్కరించారు. జ్ఞానవంతమైన దళిత సమాజం ఏర్పాటుకు మాల, మాదిగల్లో చైతన్యం నింపడానికి ఈ దీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దళితుల కోసం పనిచేసిన అంబేద్కర్, పూలే బాటలో నడవాలంటే విద్యావ్యాప్తి ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకుడు భాస్కర్, నాయకులు పొట్టపెంజర రమేశ్, మల్లికార్జున్, బేడబుడగ జంగాల నేత హనుమంతు, హోలిదాసరి అధ్యక్షుడు వీరేశం, డక్కలి సంఘం అధ్యక్షుడు మాగేశ్, వేణుగోపాల్, మురళీ పాల్గొన్నారు.