కూకట్పల్లి నియోజకవర్గంలోని దళితుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి దళిత ఐక్యవేదిక నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణారావును మర్యాదపూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు. అలా గే అంబేద్కర్ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతిగా వ్యవహరిస్తూ అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దళితులు అవకాశాలను అందిపుచ్చుకుని వృద్ధిని సాధించాలన్నారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. దళిత ఐక్యవేదిక నూతన కమిటీ సభ్యులు బాధ్యతగా పనిచేసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని కోరారు. దళిత ఐక్యవేదికకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు అందజేస్తానన్నారు. అలాగే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని దళిత ఐక్యవేదిక నాయకులు కలిసి సన్మానించారు. కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు బోడ నర్సింగరావు, కార్యనిర్వాహక అధ్యక్షురాలు బండి సుధ, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జెల్లా రాము, అదనపు కార్యదర్శి సాదా బాలయ్య, సంయుక్త కార్యదర్శి ఎడ్ల అనిల్కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎడ్ల కవిత, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నపారి చంద్రశేఖర్, నియోజకవర్గం ఎస్సీ విభాగం అధ్యక్షుడు బొట్టు విష్ణు ఉన్నారు.