కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం జరిగిన నాలుగో విడుత ఎన్నికలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అదనంగా 71 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్)ను వెంటనే తరలించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో 33 కంపెనీల బీఎస్ఎఫ్, 12 కంపెనీల సీఆర్పీఎఫ్, 13 కంపెనీల ఐటీబీపీ, 9 కంపెనీల ఎస్ఎస్బీ, 4 కంపెనీల సీఐఎస్ఎఫ్ దళాలను వెంటనే మోహరించనున్నారు.
కూచ్ బెహర్ జిల్లాలోని సితాల్కుచి నియోజకవర్గంలో శనివారం సీఐఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మరో ఘర్షణలో ఒకరు మరణించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో 126వ బూత్లో పోలింగ్ను ఈసీ వాయిదా వేసింది.
కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఆదివారం అక్కడికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించి కాల్పులపై నిరసన తెలుపుతానని వెల్లడించారు.