అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాష్ర్ట ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా ఏపీలో పగటి పూట కూడా కర్ఫ్యూ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. నిన్న ఒక్కరోజే 23,997 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. కరోనా ఉధృతిని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పగటి కర్ఫ్యూపై మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.